- సిరిసిల్ల జిల్లాలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం
- ఆధారాల్లేకున్నా సాంకేతిక పరిజ్ఞానంతో కేసును చేదించిన పోలీసులు
- ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి పాపను రక్షించిన ప్రత్యేక బృందం
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు సాఫల్యంగా చేదించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, సాంకేతిక పరిజ్ఞానంతో కేసును విచారించి, ముగ్గురు మహిళలను అరెస్టు చేసి పాపను రక్షించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక బృందాన్ని అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం పొందింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ తన కుమార్తె అద్వితతో (4) వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చింది. మతిస్థిమితం లేని లాస్య తన కుమార్తెను సరైన విధంగా చూడకపోవడం గమనించిన మహబూబాబాద్కు చెందిన ముగ్గురు మహిళలు, ఆమెను నమ్మించి, పాపను తీసుకువెళ్లారు.
పాప అదృశ్యమైన తరువాత, ఆమె మేనమామ గంగస్వామి వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పాపను మహబూబాబాద్ జిల్లాలో గుర్తించారు.
ముగ్గురు మహిళలను అరెస్టు చేసి పాపను రక్షించారు. ఈ కేసు విచారణలో వేములవాడ సీఐ వీర ప్రసాద్, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ సందర్భంగా పోలీస్ బృందాన్ని అభినందించారు