- గందె సురేష్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.
- రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నిర్వహణ.
రంగారెడ్డి జిల్లా:
శుక్రవారం షాద్నగర్ కు చెందిన గందె సురేష్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఇతర నామినేషన్లు స్వచ్చందంగా ఉపసంహరించుకోవడంతో సురేష్ అధ్యక్షుడిగా ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా:
రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా షాద్నగర్కు చెందిన గందె సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు శుక్రవారం రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. షాద్నగర్ నుండి పలు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీచేసినప్పటికీ, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యవర్గం మరియు పెద్దలు ఇతర నామినేషన్లను స్వచ్చందంగా ఉపసంహరించుకోవడం ద్వారా గందె సురేష్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
గందె సురేష్ గతంలో వాసవి క్లబ్ చార్టర్ ప్రసిడెంట్గా పని చేసిన అనుభవం కలిగినవారు. ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సరాపు రమేష్ కుమార్, అగీరు రవికుమార్ గుప్త, రిటైర్డ్ తహసిల్దార్ సరావు జగదీశ్వర్ తదితరులు అభినందనలు తెలిపారు.