- బైంసాలో గణనాథుని దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదానం
- హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ ప్రారంభం
- వివేక్ వెల్పేర్ సొసైటీ సేవా కార్యక్రమాలు
: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కిసాన్ గల్లీలో గణనాథుడి మండపం వద్ద భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ ప్రారంభించారు. వివేక్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో భక్తులకు సేవా కార్యక్రమాలు జరగడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో ఆదివారం వివేక్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణనాథుడి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు అన్నదానం చేయడం శుభ పరిణామమని, భవిష్యత్తులో సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ముందుగా గణనాథుడికి హారతి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు, గణేష్ మండపం నిర్వాహకులు, భక్తులు, ప్రముఖులు పాల్గొన్నారు.