నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామంలోని ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.
నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామంలోని ఎస్ ఆర్ ప్రైమ్ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నేటి తరంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు.
మొక్కలు జీవనాధారమని, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












