హైదరాబాద్, జులై 19
భగయనగోతెగససృతి,సదయతీగనిిచఆషఢబోనసదిైభగభమైది.చితతమగోొోటైొైనశీజగదబిమహళిమమిిగతొిబోనననిసమిచతోఈనెోజఉతసధిిగజిగిది.షటనమూనచిదిగభతతిసతనన.
భాగ్యనగరంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సందడి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి గురువారం తొలి బోనాన్ని సమర్పించడంతో ఈ నెల రోజుల ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరిగింది.
అమావాస్య తర్వాత వచ్చే గురు, ఆదివారాల్లో మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగానే మొదటి ఆదివారం నాటి బోనాల సమర్పణతో గోల్కొండ కోట ప్రాంగణం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభతో మురిసిపోతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాల సమర్పణ ఉంటుంది. తదుపరి మంగళవారం అమ్మవారి కల్యాణ వేడుకలు జరుగుతాయి. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర, నాల్గో ఆదివారం పాత బస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
బోనాల పండుగను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు గాను భారీగా పోలీసు బందోబస్తును మోహరించారు.











