
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల నేపథ్యంలో, ఏప్రిల్ 1, 2024 నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు, రుసుములలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వంటి ప్రధాన బ్యాంకులు ఈ మార్పులను ఇప్పటికే ప్రకటించాయి.



















