
మిర్యాలగూడ చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా గంజి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఆయిటి పాముల మురళీధర్, కోశాధికారిగా రావిరాల నాగేందర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎండి మహిముద్ అధ్యక్షతన జరిగాయి.



















