కన్నారెడ్డి నూతన సర్పంచ్ సాయిలు కు ఘన సన్మానం

కన్నారెడ్డి నూతన సర్పంచ్ సాయిలు కు ఘన సన్మానం

కామారెడ్డి, డిసెంబర్ 16 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా నూతన గ్రామ పంచాయతీకి ఎన్నికైన సర్పంచ్ సాయిలుకు ఘన సన్మానం జరిగింది. మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోహర్ రెడ్డి, “ప్రజలు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి. సమిష్టి కృషితో వాడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి” అని సూచించారు.సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత సాయి బాబా, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment