చోరికి గురైన 70 సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన పోలీసులు ఎస్పీ డా.జి.జానకి షర్మిల

చోరికి గురైన 70 సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన పోలీసులు ఎస్పీ డా.జి.జానకి షర్మిల

చోరికి గురైన 70 సెల్ ఫోన్లను తిరిగి అప్పగించిన పోలీసులు

ఎస్పీ డా.జి.జానకి షర్మిల

మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఆగస్టు 04
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఆదేశనుసారంగా, నిర్మల్ పోలీసులు మొబైల్ దొంగతనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ ఐ ఆర్ పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించి నెల రోజుల్లో 70 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోగొట్టుకున్న, చోరి గురైన 70 మొబైల్ ఫోన్లు (సుమారుగా ఎనిమిది లక్షల నలభై వేల విలువ గల ఫోన్లను) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. మొబైల్ వినియోగదారులను అప్రమత్తంగా ఉండాలన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సి ఈ ఐ ఆర్ వినియోగదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో వారి వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1566 ఫోన్లు (సుమారుగా కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు విలువ గల ఫోన్లను) రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సి ఈ ఐ ఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment