కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్న చేపూర్ గ్రామస్తులు

M4 న్యూస్ (ప్రతినిధి)

, ఆర్మూర్, అక్టోబర్ 22, 2024:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకుడు కొమురం భీమ్ 123వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడిపల్లి గిరీష్, రాటం భూమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన మహా యోధుడు కొమురం భీమ్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Comment